Corona | న్యూఢిల్లీ: కరోనా వైరస్ చైనా సృష్టేనని, జీవాయుధంగా వినియోగించుకునే ఉద్దేశంతో దీనిని ల్యాబ్లో అభివృద్ధి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, చైనా ఎప్పుడూ ఈ విషయంలో బయటపడలేదు. తమకు సంబంధం లేదని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ చైనాలోని వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిసెర్చర్ చావో షావో సంచలన విషయాన్ని వెల్లడించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. కరోనా వైరస్ సృష్టికర్త చైనాయేనని, జీవాయుధంగా ఉపయోగించుకునే లక్ష్యం తో దానికి ల్యాబ్లో పురుడుపోసారని తెలిపారు. పై అధికారి ఒకరు తమకు నాలుగు స్ట్రెయిన్లు ఇచ్చి వాటిలో ఏది వేగంగా, ప్రభావవంతంగా వ్యాప్తి చెందుతుందో గుర్తించాలని కోరారని తెలిపారు. ఇంటర్నేషనల్ ప్రెస్ అసోయేషన్ సభ్యుడు, చైనాకు చెందిన హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ను ఆయన ‘బయోవెపన్’ (జీవాయుధం)గా అభివర్ణించారు.
2019 వూహాన్లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో షావో సహచరులు చాలామంది అదృశ్యమయ్యారు. అథ్లెట్ల ఆరోగ్య పరీక్షలకు వైరాలజిస్టులతో పనేంటని, బహుశా వారికి వైరస్ను ఉద్దేశపూర్వకంగా అంటించేందుకే పంపి ఉంటారని ఓ నిర్ణయానికి వచ్చారు.
ఏప్రిల్ 2020లో షావోను అధికారులు జింజియాంగ్ పంపి అక్కడి రీ-ఎడ్యుకేషన్ శిబిరాలలో ఉన్న వుయిగర్ల(ముస్లింలలో ఒక వర్గం) ఆరోగ్యాన్ని పరీక్షించాలని కోరారు. వైరస్ను తనతో వ్యాపింపజేయడమో లేదంటే మానవులపై వైరస్ ఎలా పనిచేస్తున్నదో తెలుసుకునేందుకో తనను అక్కడికి పంపి ఉంటారని షావో వివరించారు.