కురవి, డిసెంబర్ 18: మహబూబాబాద్ జిల్లా కురవిలో శనివారం ఓ వానరానికి కరెంట్ షాక్ తగలడంతో స్పృహ కోల్పోయింది. వెంటనే ఓ యువకుడు నోటితో శ్వాస అందించి కాపాడాడు. స్థానిక జడ్పీ హైస్కూల్ వద్ద ఓ చెట్టు నుంచి మరోచెట్టుపైకి దూకుతున్న వానరం పట్టుతప్పి కరెంటు తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురై కిందపడింది. అక్కడే ఉన్న యువకులు భూక్యా రమేశ్, బుడిగే భద్రసేనా గౌడ్, రాగం కృష్ణ వెంటనే వానరం వద్దకు వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో భూక్యా రమేశ్ వెంటనే కోతికి నోటితో ఊపిరందించాడు. కొద్దిసేపటికి కదలిక కనిపించడంతో వెంటనే వారు దాన్ని బైక్పై పశువైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం కోతి కోలుకోవడంతో స్థానికులు సదరు యువకులను అభినందించారు.
విజయవాడలో పాముకు దహన సంస్కారాలు
విజయవాడ దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఇంద్రకీలాద్రిపై సంచరించే పాముల్లో ఒకటి మృతి చెందడంతో శాస్ర్తోక్తంగా దహన సంస్కారాలు నిర్వహించారు. రెండు సర్పాలు ఇంద్రకీలాద్రిపై గత కొంతకాలంగా కనిపిస్తున్నాయని, ఇటీవలే కనిపించకుండా పోయిన ఒక పాము కొండ దిగువ ప్రాంతంలో చనిపోయి కనిపించిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.