Jagtial | జగిత్యాల/జగిత్యాల రూరల్, మార్చి 9: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నే తలను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పటి నుంచి ఆడబిడ్డలకు చెక్కులతోపాటు చీరెలను అం దించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఎమ్మె ల్యే సంజయ్, ఇప్పుడు కూడా అలానే ఇవ్వాలనుకున్నారు.
తహసీల్దార్ కార్యాలయానికి కొద్దిదూరంలో లబ్ధిదారులకు చీరలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ తీరుపై రోడ్డెక్కి నిరసన తెలిపా రు. ఇస్తానన్న తులం బంగారం ఇవ్వకపోగా, ఎమ్మెల్యే ఇచ్చే చీరను ఇవ్వకుండా అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. ఫ్లెక్సీలో ఎమ్మె ల్యే ఫొటో వేయకపోవడంపై ప్రొటోకాల్ వివా దంతో గొడవకు దారితీయగా విప్ లక్ష్మణ్ కుమార్ జోక్యంతో సద్దుమణిగింది.