నిజామాబాద్ క్రైం, మార్చి 4: నిజామాబాద్లో శనివారం ఓ తల్లి బిడ్డ సహా ఐదో అంతస్థుపై నుంచి దూకింది. తల్లి మృతి చెందగా, చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన జటాల అనూష(27)కు, కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్తో నాలుగేండ్ల క్రితం పెండ్లి జరిగింది. వీరికి శ్రీహిత(3), శ్రీకృతి(1) ఉన్నారు. గతేడాది శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. పెద్ద కూతురు శ్రీహితను అత్తమామల వద్దే ఉంచి, కూతురు శ్రీకృతితో నిజామాబాద్లోని తన పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఎవరికీ భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది.