హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచుతానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గిరిజన బిడ్డల చిరకాల కోరిక నెరవేరింది. రిజర్వేషన్కు సంబంధించిన జీవోను వారం, పది రోజుల్లో విడుదల చేస్తామనడం చరిత్రాత్మక నిర్ణయం. సీఎం కేసీఆర్కు గిరిజన బిడ్డలమంతా రుణపడి ఉంటాం. వీలైనంత త్వరగా పోడు సమస్యను పరిష్కరించి, గిరిజన బంధు ప్రవేశపెడతానని ప్రకటించడం గొప్ప విషయం. గిరిజన బంధు, పోడు భూముల సమస్య పరిష్కరిస్తే బంజారా జాతి జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయి. రిజర్వేషన్ పెంపుతో గిరిజన బిడ్డలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎదుగుతారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్కు యావత్ గిరిజన జాతి పక్షాన, రాష్ట్ర సేవాలాల్ సేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.’
– గుగులోత్ సంతోష్ నాయక్,సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్