Cold Weather | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలో 10 డిగ్రీలకు తగ్గిందని వివరించింది. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఆరోగ్య సూత్రాలు పాటించాలని పేర్కొన్నది.