హైదరాబాద్ సిటీబ్యూరో/హనుమకొం డ, మే 27 (నమస్తే తెలంగాణ): యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరుగనుండగా, అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేయగా 45,611 మంది అభ్యర్థు లు, వరంగల్ నగరంలో 11 కేంద్రాల్లో 5,035 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గం టల నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీ శాట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
పరీక్ష నిర్వహణకు అవసరమైన లైజన్, అసిస్టెంట్ లైజన్, రూట్ ఆఫీసర్లు, సిబ్బందిని నియమించారు. శనివారం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో సంబంధిత జిల్లా అధికారులతో డీఆర్వో సూర్యలత సమీక్షించారు. పరీక్షలు సజావుగా నిర్వహించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కేంద్రంలో ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు కమిషన్ నియమ నిబంధనలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, పోలీస్శాఖ డీసీపీ బాబురావు, విద్యుత్శాఖ, ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
సివిల్స్ ప్రిలి మ్స్ పరీక్షలో నెగెటివ్ మార్కులుంటాయి. సమాధానాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్ర శ్నలను చూసి అ ప్పటికప్పుడు ఎంపిక చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ మరీ ముఖ్యం. మొదటి పేపర్ తర్వాత ఆ పేపర్ ఎలా రాశామని అంతా చర్చించుకుంటారు. ఇది పూ ర్తిగా తప్పు. సరిగ్గా రాయకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుం ది. దీని ప్రభావం పేపర్-2 మీద పడుతుంది. సీశాట్ పేపర్ క్వాలిఫైయింగ్ పే పరే అయినా, ప్రశ్నల నిడివి పెద్దదిగా ఇ స్తున్నారు. జాగ్రత్త ముఖ్యం. సమయం వృథా చేసుకోవద్దు.