హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలకానున్నది. మార్చి 16 నుంచి మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
పరీక్షలను జూన్ 6 నుంచి 9 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో పీజీఈసెట్ సెట్ కమిటీ సమావేశమై, షెడ్యూల్ను ఖరారు చేసింది. ఆయా షెడ్యూల్ను పీజీఈసెట్ కన్వీనర్ ఏ అరుణకుమారి, కో కన్వీనర్ ప్రొఫెసర్ బీ రవీంద్రారెడ్డిలు విడుదల చేశారు.