మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి(Tractor overturned) మృతి ఓ వ్యక్తి మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad)ఇనుగుర్తి మండలం లాలు తండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాము తండాకు చెందిన అనే వ్యక్తి బిచ్చ నాయక్ నారుమడి దున్నుతుండగా ప్రమాదవాశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిచ్చ నాయక్ మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.