హైదరాబాద్, సెప్టెంబర్22 (నమస్తే తెలంగాణ): వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈనెల 26న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ చైర్మన్గా అక్కరాజు శ్రీనివాస్ను, కొండూరు సత్యనారాయణతోపాటు మరో 25 మంది వైస్చైర్మన్లు, 30 మంది కన్వీనర్లు, 19 మందిని కోకన్వీనర్లుగా నియమించింది. ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ శాఖను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంపై తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. స్వరాష్ట్రంలో, కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని కొనియాడారు. ఐలమ్మ జయంతి వేడుకల్లో రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.