హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీ భానుప్రసాద్, దండే విఠల్, ఎంసీ కోటిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ సోమవారం వారితో ప్రమాణం చేయించారు. అనంతరం శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వారిని అభినందించి.. గుర్తింపు కార్డును, శాసనమండలి నిబంధనల పుస్తకాన్ని అందజేశారు. నలుగురు ఎమ్మెల్సీలకు మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, రైతు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, బస్వరాజు సారయ్య, టీ రవీందర్రావు, ఎల్ రమణ, నవీన్రావు, శేరి సుభాష్రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, శంకర్నాయక్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, గాదరి కిశోర్, విఠల్రెడ్డి, రేఖానాయక్, ఆత్రం సక్కు, భాస్కర్రావు, జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, ఎలిమినేటి సందీప్రెడ్డి, సంపత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహచార్యులు అభినందించారు. కార్యక్రమానికి వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.