Commission for Women | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ వర్సిటీలో విద్యార్థినిపై పోలీసుల దాడిని రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తూ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు గురువారం డీజీపీకి లేఖ రాసింది. బాధ్యులైన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
విద్యార్థినిని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్లడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను ఆదేశించింది.