హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎకో-టూరిజం అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలపై ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ చిలుకూరులోని మృగవణి రిసార్ట్స్లో సదస్సు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వెల్లడించింది. ఇందులో వివిధ రాష్ర్టాలకు చెందిన 75 మంది నిపుణులు పాల్గొంటారని సంస్థ వీసీ, ఎండీ డాక్టర్ జీ చంద్రశేఖర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.