మాల్/తుర్కపల్లి/దుండిగల్, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఆటాపాటలతో సభా ప్రాంగణాలు సందడిగా మారుతున్నాయి. అంతా కలిసి ఆనందంగా భోజనాలు చేస్తున్నారు. శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రం (మాల్)లో నిర్వహించిన సమ్మేళనంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో నిర్వహించిన సమ్మేళనంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లంలో నిర్వహించిన సమ్మేళనానికి ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయ్యారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతినగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.