వరంగల్ : భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలి. ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాలకు అర్థం చేయించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ పోలీస్ హెడ్ క్వాటర్స్ నుంచి జేఎన్ఎస్ వరకు నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాంతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 16న సామూహిక స్వాతంత్య్ర జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాలని విజయవంతం చేయాలన్నారు. గాంధీజీ ఆశయాలను మనమంతా ఆచరించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా మనమంతా కృషి చేయాలని మంత్రి సూచించారు.
ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జి.డబ్లూ.యం.సి . మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జి.డబ్లూ.యం.సి కమిషనర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి పాల్గొన్నారు.