నాంపల్లి కోర్టులు, జూన్ 2 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డీఈ సహా నలుగురిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు శుక్రవారం 12వ అదనపు మె ట్రో పాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎన్ రమేశ్, చాట్జీపీటీ సహకారంతో సమాధానాలు రాసిన ప్రశాంత్, మ హేశ్, నరేశ్, ఏఈ పేపర్ కొనుగోలు చేసిన శ్రీనివాస్ నాయక్ను 10 రోజుల కోసం కస్టడీకి ఇవ్వాలని కోరారు.
డీఈ నుంచి కీలక సమాచారం సేకరించాల్సి ఉందని సిట్ పీపీ కృష్ణయ్య కోర్టుకు విన్నవించారు. డీఈ ద్వారా ఇతరులకు ప్రశ్నపత్రాలను అందించినట్టు ప్రాథమిక సమాచారం ఉందని, 70 లక్షలకు ప్రశ్నపత్రాన్ని అమ్మినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. తీర్పును మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య వా యిదా వేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోస్గి రవికుమార్, కోస్గి భగవంత్కుమార్కు సిట్ పీపీ కౌంటర్లు దాఖలు చేశారు. గుణ్రెడ్డి క్రాంతికుమార్రెడ్డి, కొంతం శశిధర్రెడ్డి, అజ్మీరా పృథ్వీరాజ్, జాదవ్ రాజేశ్వర్ తరఫున వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.