హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ): తొమ్మిది, పదో తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వ్యాసరూప, షార్ట్ క్వశ్చన్స్ చాయిస్, మార్కుల్లో స్వల్ప మార్పులు చేస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి పరీక్షల్లో గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ప్రశ్నల సంఖ్య, మార్కులపై పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ వాటిని సవరించింది. ఇందులోభాగంగా, గతంలో వ్యాసరూప ప్రశ్నల విభాగంలో 12 ప్రశ్నలకు ఆరు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రశ్నల సంఖ్యను ఆరుకు తగ్గించారు. ఇందులో ఏవేనీ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. ఇదివరకు వ్యాసరూప ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఐదు మార్కులుండగా, ఇప్పుడు ఆరు మార్కులకు పెంచారు. స్వల్ప
మాదిరిగానే ఇచ్చిన ఆరు ప్రశ్నలకూ సమాధానం రాయాలి. ఈ విభాగంలో గతంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులుండగా ఇప్పుడు నాలుగు మార్కులకు పెంచారు. అతి స్వల్ప ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే ఆరు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కలిపారు. ఆబ్జెక్టివ్ విభాగంలోనూ గతంలో మాదిరిగానే 20 ప్రశ్నలుంటాయి ఒక్కోదానికి ఒక మార్కు కేటాయించారు.