హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ హరగోపాల్పై ఉపా కేసు ఎత్తివేయడం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ప్రొఫెసర్ కాశీం, విమలక, సంధ్య తదితరులపై ఉన్న ఉపా కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. వారంతా ప్రజా జీవితంలో ఉంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటంలో క్రియాశీలకంగా పని చేశారని, అందుకే వారిపై కూడా కేసులు ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కోరారు.