హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీని ఇకనుం చి బీఆర్ఎస్గా పరిగణిస్తామని రాజ్యసభ బులెటిన్లో తెలిపింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యసభలో ప్రాతిని ధ్యం వహిస్తున్న పార్టీలు, ఆయా పార్టీల సభ్యు ల వివరాలను బులెటిన్లో పొందుపరిచారు. బీఆర్ఎస్ పార్టీకి ఏడుగురు సభ్యులు ఉన్నట్టు పేర్కొన్నది. బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్గా కే కేశవరావు, సభ్యులుగా సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, కేఆర్ సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచం ద్ర, దీవకొండ దామోదర్రావు, బీ పార్థసారథిరెడ్డి పేర్లను రాజ్యసభ బులెటిన్లో పేర్కొనడం గమనార్హం.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ గత సంవత్సరం దసరా పం డుగ (అక్టోబర్ 5, 2022న) నాడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పరిగణించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి పార్టీ తీర్మానం కాపీతో విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ, లోక్సభల్లో కూడా తమను ఇకనుంచి బీఆర్ఎస్ సభ్యులుగా పరిగణించాలని రాజ్యసభ చైర్మన్కు పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్సభ స్పీకర్కు లోక్సభలో పార్టీ నేత నా మా నాగేశ్వర్రావు లిఖితపూర్వకంగా విజ్ఞప్తిచేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.