న్యూఢిల్లీ, అక్టోబర్ 8: గ్లోబల్ టాప్ 2 పర్సెంట్ పరిశోధకుల్లో ‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్’ ప్రొఫెసర్లు సత్తా చాటారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 24 ప్రొఫెసర్లు ‘గ్లోబల్ టాప్ 2 పర్సెంట్’లో ఉన్నారంటూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ (అమెరికా) తాజాగా నివేదిక విడుదల చేసింది.
ప్రపంచ పరిశోధనా రంగంలో పరిశోధకులకు ఇచ్చే ర్యాంకింగ్ను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్లు..గోవర్ధన్ మెహతా, ఏఎస్ రాఘవేంద్ర, ఎంఎన్వీ ప్రసాద్, అత్తిపల్లి ఆర్ రెడ్డి, ఎస్ఆర్ సిట్యే, డీ నారాయణరావ్, కే భానుశంకర్ రావ్, ప్రమోద్ కే నాయర్, సోమా వేణుగోపాల్రావ్, సతీశ్ నారాయాణ, ముథమిలారాసన్, నియాజ్ అహ్మద్, సచిన్ భాలేకర్, అలోక్ సింగ్, అరుణశ్రీ, లలితా గురుప్రసాద్, డీబీ రామాచారి, రాజదురై, అశ్విని నాన్జియా, అనునాయ్ సమంత, నాగేంద్రకుమార్లకు జాబితాలో చోటుదక్కింది.