హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కా ర్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ ప్ర క్రియ పూర్తయింది. రెగ్యులరైజేషన్కు అ ర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్టు గుర్తించగా, ఈ మేరకు ఆర్థిక శాఖ గ్రేడ్- 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జేపీఎస్లు కార్యదర్శి గ్రేడ్ 4 హోదాలో కొనసాగనున్నారు. గ్రామానికో పంచాయతీ కార్యదర్శి లక్ష్యంతో 9 వేలకు పైగా జేపీఎస్ పోస్టులను సీఎం కేసీఆర్ మం జూరు చేశారు. వీరికి పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని జేపీఎస్లుగా నియమించారు.
నాలుగేండ్లుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేండ్లు పూర్తి చేసుకున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్, డీఎస్పీ, డీఎఫ్వోలతో కమిటీని నియమించి రెగ్యులరైజేషన్కు అర్హులైన వారి జాబితాను పంచాయతీరాజ్కు అందించారు. జేపీఎస్ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 4 పోస్టులు క్రి యేట్ చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టులపై శనివారం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.