హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. తొలిరోజు 500 మంది ఫీజు చెల్లించగా, 300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ను విడుదల చేసింది. పరీక్షా విధానాన్ని సైతం ఖరారు చేసి వెబ్సైట్లో పొందుపరిచింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్) మినహా అన్ని స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషాపండితులకు 2:30 గంటలపాటు పరీక్షను నిర్వహిస్తారు.
ఒక్క స్కూల్ అసిస్టెంట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్కు మాత్రం మూడు గంటలపాటు పరీక్ష జరుగుతుంది. మిగతా పేపర్లకు 160 ప్రశ్నలు, 80 మార్కులు (ఒక్కో ప్రశ్నకు అరమార్కు) ఉండగా, స్కూల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్స్కు మాత్రం 200 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.