హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా 302 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
త్వరలో అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, యూనియన్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు.