హైదరాబాద్ : రాష్ట్రంలోని గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్స్ అండ్ వర్క్ ఇన్స్పె్క్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం బాధ్యత తీసుకుంటానని, వారిని సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా కాపాడు కుంటానని, ఆందోళన చెందవద్దని అని అన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య, సంఘం అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొగ్గుల వెంకట రామిరెడ్డి, కార్యదర్శి రఘువీర్ ప్రసాద్ గుప్తా, జనరల్ మేనేజర్లు చైతన్య తదితరులు పాల్గొన్నారు.
పొంగులేటితో కేరళ మంత్రి భేటి
కేరళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్(Kerala Minister Rajan), కేరళ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ కార్యదర్శి సాంబశివరావ్, శనివారం తెలంగాణ మంత్రి పొంగులేటితో సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రంలో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్తో పాటు రెవెన్యూ(Revenue) విభాగం పనితీరు, వాటి వివరాలను పొంగులేటి అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ప్రజలకు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు, అకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయన మంత్రి అభిప్రాయపడ్డారు.