హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ తుది విడుత కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది.
మొదటిరోజే 994 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. వెబ్ ఆప్షన్లకు సోమవారం వరకు అవకాశమివ్వగా, ఈ నెల 7న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.