రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు పలుచోట్ల రోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎర్కొంటున్నారు. జిల్లాలోని వేములవాడ మూలవాగులో బుగ్గారం గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. నాలుగు గంటలుగా మూలవాగు మధ్య లోనే చెట్టుకొని పట్టుకొని భయంభయంగా గడిపాడు.
సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ సీఐ కర్ణాకర్ తన సిబ్బందితో కలిసి తాళ్ల సహాయంతో తిరుపతిని సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు. కాగా, అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, వర్షం కురిసే సమయంలో కరెంట్ స్తంభాలు, చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.