హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుశాఖ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రణీత్రావుపై చర్యలకు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు సీఐడీ పోలీసులకు లేదా సిట్కు కేసును అప్పగించనున్నట్టు తెలిసింది.
ఎస్ఐబీ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, పలు రికార్డులు మాయం చేయడంతోపాటు 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారనేది ప్రణీత్రావుపై ప్రధాన అభియోగం. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటువేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ విడిచివెళ్లొద్దని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.