హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వివాదాల పరిషారానికి పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు,విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు గాను ప్రత్యేక పరిశీలకులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆదేశాలు జారీచేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండాసురేఖ, సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొంతకాలంగా సాగుతున్న ప్రొటోకాల్, నియోజకవర్గాల వివాదం తాజాగా త్రీవరూపం దాల్చడంతో వాటిని పరిష్కరించే బాధ్యతను ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్కు అప్పగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో స్థానిక నియామకాల విషయంలో మందులసామేల్ వర్గం వర్సెస్ చామల వర్గం మధ్య తలెత్తిన విభేదాలను పరిషరించే బాధ్యతను టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు.