హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ జవాబు పత్రాల ఆఫ్లైన్ మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిరోజు సంస్కృతం పేపర్తో మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 15 క్యాంపులను ఏర్పాటుచేశారు.
వీటిలో మూడు క్యాంపుల్లో స్కానింగ్ ఉండదని, పేపర్లను మూల్యాంకనం మాత్రమే చేస్తారని ఇంటర్బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఆన్స్క్రీన్ మూల్యాంకనం కొన్ని పేపర్లకు పరిమితం కానున్నది. టెండర్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో కొన్ని పేపర్లను పాక్షికంగా డిజిటల్ ఆన్స్క్రీన్ చేయించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.