హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
శనివారం స్వామివారిని 82,999 మంది భక్తులు దర్శించుకోగా 38,875 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.