హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ముగ్గురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు లింగయ్యయాదవ్, సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఏప్రిల్తో ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ నెల 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ల మొదటి రోజు ఒక్కటి కూడా దాఖలు కాలేదు.