హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7 : వరంగల్లోని నిట్ సందడిగా మారింది. ‘కళాధ్వని స్ప్రింగ్ స్ప్రీ-2023’లో భాగంగా విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఈవెంట్లలో భాగంగా శుక్రవారం ఐపీఎల్ ప్లేయర్ల వేలంపాట నుంచి మొదలు సీడీ పెయింటింగ్, కరౌకే, పాప్డార్ట్ (బెలూన్స్ టాస్క్లు), ఫిట్ఫిస్టా (ఫిట్నెస్ క్లబ్), ఇమేజ్ స్టార్టర్స్, డబుల్ స్ర్కైబుల్, కుండల తయారీ, హ్యాండ్ ప్రింట్స్, ఫిల్మ్హౌస్ ఇలా అనేక వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అంబేద్కర్ లర్నింగ్ సెంటర్లో ‘లెట్స్ టాక్ టు సుమ కనకాల’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ఆమెతో సరదాగా ముచ్చటించారు.