హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ‘నూతన సంవత్సరం రోజున అనేక నిర్ణయాలు తీసుకొనే మనం.. మొక్కలు నాటి పచ్చదనం పెంచే లక్ష్యాలు కూడా ఏర్పర్చుకోవాలి’ అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం ఆయన ప్రగతిభవన్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొకలు ప్రాణవాయువు ఇచ్చి కాపాడుతున్నాయని అన్నారు. గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వాతావరణ మార్పులకు అడ్డుకట్టపడాలంటే మొకలు నాటడం ఒకటే శరణ్యమని.. ప్రతిఒకరూ ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్, చీటీ రామారావు, గ్రీన్ చాలెంజ్ ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.