హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్ఎంజీ) ఇంటర్న్షిప్ సీట్లను ఎయిమ్స్ కళాశాలల్లో కేటాయించవద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆదేశించింది. విదేశాల్లో వైద్యవిద్య చదివిన భారతీయ విద్యార్థులు మన దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే కచ్చితంగా ఎఫ్ఎంజీ ఎంట్రెన్స్ రాసి, ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో రొటేషన్ పద్ధతిలో వీరికి సీట్లను కేటాయిస్తుంటారు. అయితే ఎయిమ్స్ల కాలేజీల్లో సీట్లు కేటాయించకపోవడంపై ఎన్ఎంసీని ప్రశ్నించగా, శనివారం స్పష్టత ఇచ్చింది. ఎయిమ్స్లు ఎన్ఎంసీ పరిధిలోకి రానందున వాటిల్లో ఎఫ్ఎంజీ సీట్లను కేటాయించవద్దని రాష్ర్టాల మెడికల్ కౌన్సిళ్లకు స్పష్టం చేసింది.