హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : కళలను బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేస్తూ జాతీయ విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రత్యేకించి సెకండరీ ఎడ్యుకేషన్లో కళాధారిత విద్యను తప్పనిసరి చేసింది. 9 నుంచి 12 తరగతుల వరకు కళలను అంతర్భాగం చేసి విద్యాబోధనను కొనసాగించాలని సూచించింది. ఈ మేరకు సెకండరీ స్టేజ్లో ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.
ప్రస్తుతం మన విద్యార్థులు ‘బట్టి’ విధానంలో పాఠ్యాంశాలను నేర్చుకొంటున్నారు. ఈ విధానం ఆశించిన ఫలితాలు రావడం లేదు. కళతో కలిసి పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో భాగంగా కళాధారిత విద్యను అమలుచేయాలని ఎన్సీఈఆర్టీ సూచించింది. దృశ్యకళలు, ఆచరణాత్మక కళలను అంతర్భాగం చేసి పాఠ్యాంశాలు బోధించేందుకు కరదీపికను రూపొందించింది. ఈ కరదీపికను హైదరాబాద్లోని నాచారం ఢిల్లీ పబ్లిక్స్కూల్ ప్రిన్సిపాల్ సునితారావు, వైస్ ప్రిన్సిపాల్ శిరీష, టీచర్లు డాక్టర్ శ్రీనివాస్, దీపా రమేశ్, మార్టినా, శ్రీవిద్య గణేష్ రూపొందించారు. సైన్స్, గణితం సబ్జెక్టు పాఠ్యాంశాలను కళలలో ఎలా అనుసంధానించి బోధించడంపై వంటి అంశాలను కరదీపికలో పొందుపరిచారు.
ఉదాహరణలిలా