హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన పీసర రత్నాకర్రావు మూడోసారి ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశం లో 23 రాష్ర్టాలకు చెందిన విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని 2024 -27కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన శైలేంద్ర దూబే జాతీయ అధ్యక్షుడిగా, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రత్నాకర్రావు ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.అడిషనల్ సెక్రటరీ జనరల్గా రాష్ర్టానికి చెందిన ఎం. శివశంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీ శ్రీనాథ్రెడ్డి, సెక్రటరీగా పరికి సదానందం, జాయింట్ సెక్రటరీలుగా మంగీలాల్, జనప్రియ, వెంకటనారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అంజయ్య, రమణారావు, పీవీరావు, వరప్రసాద్రావు, విద్యాసాగర్లు రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో టీఎస్పీఈఏ సభ్యులు, విద్యుత్తు ఇంజినీర్లు ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్ రత్నాకర్రావుతో పాటు నూతన కార్యవర్గ సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ నాయకులు సత్యనారాయణరావు, కిషోర్, సతీశ్, సురేశ్, వెంకటేశ్, బుచ్చయ్య, గోపాల్రావు, బాగయ్య, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.