కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పండుగ పూట పెను విషాదం చోసుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లి ఇద్దరు (తల్లి, కొడుకు) గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు..లోనవెళ్లి గ్రామానికి చెందిన ఎరుకొండ పద్మ ( 38 ), తన కొడుకు రక్షిత్ (14 )తో కలిసి పెన్ గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.