లక్ష్మీదేవిపల్లి;భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 49 జంటలకు సామూహిక వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కొండపల్లి సాయిగోపాల్-సుజాత దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వధూవరులకు నూతన వస్ర్తాలను బహూకరించారు.