యాదాద్రి భువనగిరి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): భువనగిరి పరిధిలోని పగిడిపల్లిలో అద్భుతంగా నిర్మించిన వేంకటేశ్వర క్షేత్రం మినీ తిరుపతిగా విరాజిల్లనున్నది.
22 ఎకరాల్లో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. త్రిదండి చినజీయర్ స్వామి బుధవారం ఈ ఆలయంలో స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు ఈ ఆలయాన్ని నిర్మించారు.