హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను కోరారు. ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మిట్టల్ను కలిశారు. అన్ని క్యాడర్లకు పదోన్నతులు కల్పించాలని, 2017-18 నాయబ్ తహసీల్దార్ల ప్యానల్ ఆమోదం, 2016-17 ప్యానల్ ఇయర్ ఆమోదం పొందిన నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతులు, జిల్లా కలెక్టరేట్లలో డీఆర్వో, సీసీఎల్ఏ కార్యాలయంలో పదోన్నతి ద్వారా డిప్యూటీ కమిషనర్ పోస్టును భర్తీ చేయడం, ఏపీకి కేటాయించిన 15 మంది డిప్యూటీ కలెక్టర్లను రిలీవ్ చేయడం, తహసీల్దార్ల బదిలీలు తదితర అంశాలను ఆయనకు వివరించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు నిరంజన్రావు, కార్యదర్శి చల్లా శ్రీనివాస్, షఫియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.