KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు క్రమంగా కోలుకుంటున్నారు. బాత్రూమ్లో జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన గత కొన్ని వారాలుగా నంది నగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ఇవాళ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు వచ్చారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కుర్చిలో కూర్చుని వారితో ముచ్చటించారు. శస్త్రచికిత్స తర్వాత బెడ్కే పరిమితమైన ఆయన లేచి కుర్చీలో కూర్చోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్రావు కేసీఆర్ గురించి ఆసక్తి కరమైన ట్వీట్ చేశారు. ‘నాయకుడు తిరిగొచ్చాడు, సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు’ (ద లీడర్ ఈజ్ బ్యాక్ అండ్ రెడీ టు మేక్ వేవ్స్) అంటూ ఎక్స్ (X) లో ఆంగ్లంలో పోస్ట్ పెట్టారు.
The #Leader is back and ready to make waves.#KCR #LeadershipRevived. pic.twitter.com/9YLC7V7qbn
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 7, 2024