ఎరువుల కొరత సమస్యను కేసీఆర్ సర్కార్ ముందుగానే పసిగట్టి అరికట్టింది. పకడ్బందీ ప్రణాళికతో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నది. 2014 తర్వాత కేంద్రాల వద్ద పరిస్థితి మారింది. నేడు గ్రామగ్రామాన ఎరువుల పంపిణీ జరుగుతున్నది.
రాష్ట్రంలో నేడు చెప్పుల బారులు కనుమరుగయ్యాయి. లాఠీచార్జీలు, ధర్నాలు లేవు. పంపిణీ కేంద్రాల వద్ద పోలీసుల మోహరింపు అసలే లేదు.