హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తెలిపింది. ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫ్, రిజిస్టర్డ్ నర్సస్ అండ్ మిడ్వైఫ్, రిజిస్టర్డ్ లేడీ హెల్త్ విజిటర్స్ కేటగిరీల్లో అవార్డులు అందించనున్నట్టు వెల్లడించింది.
ఒక్కో క్యాటగిరీ నుంచి కనీసం ఐదుగురు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి జాబితాను పంపాలని, మే 12న అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపింది.