ఇంద్రవెల్లి, డిసెంబర్ 18: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా ఆలయాన్ని ప్రారంభించడంతోపాటు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజన పురోహితుల మంత్రోచ్ఛారణల నడుమ మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నాగోబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం సతీక్దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు.
ఆలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత హోమం నిర్వహించి, వేడుకలకు ముగింపు పలికారు. ఆదిలాబాద్, సిర్పూర్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, రేఖానాయక్, మాజీ ఎంపీ జీ నగేశ్, జడ్పీ చైర్పర్సన్లు జనార్దన్ రాథోడ్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీ సోయం బాపురావ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినీరెడ్డితోపాటు మెస్రం వంశీయులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగోబాను దర్శించుకొన్నారు.