సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ (E-NAM) విధానం పకడ్బందీగా అమలవుతుందని రాజస్థాన్కు చెందిన అగ్రికల్చర్ బోర్డ్ డైరక్టర్ ఉమేష్ శర్మ, జోనల్ డైరెక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ శర్మలు అన్నారు. సూర్యాపేటలో మార్కెట్లో ఈనామ్ విధానంలో అమలు చేస్తున్న నూతన పద్ధతులను తెలుసుకొని తమ రాష్ట్రంలో అనుసరించేందుకు గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట ను వారు సందర్శించారు.
ఈ సందర్బంగా వారు గంటన్నరపాటు మార్కెట్ మొత్తం కలియ తిరుగుతూ మార్కెట్ సెక్రటరీ ఎం.డీ. ఫసియొద్దిన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్లో అమలు చేస్తున్న ఈ నామ్ విధానం అద్భుతమని ప్రశంసించారు.
సూర్యాపేట మార్కెట్ లో ముఖ్యంగా ఈ నామ్ విధానంలో రైతులకు గేట్ ఎంట్రీ మొదలు కొని నాలుగు సెగ్మెంట్లుగా విభజించి సెగ్మెంటుకు ఒక ఇన్చార్జి, సబ్ స్టాప్ ను నియమించి రైతులకు అసెన్ చేయడం బాగుందన్నారు.
ఇలాంటి పారదర్శకమైన సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు పరిశీలించనున్నట్టు తెలిపారు. ఈ నామ్ విధానంకు సంబంధించిన రికార్డులను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నామన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో 95శాతం ఈనామ్ విధానం అమలు అధికారుల నిబద్ధతకు నిదర్శనమని కితాబు ఇచ్చారు.
కార్యక్రమంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎం.డీ ఫసియొద్దిన్, గ్రేడ్ 2 కార్యదర్శి శంషీర్, అసిస్టెంట్ సెక్రెటరీ పుష్పలత, యుడిసి ఖాసీం, సుపర్ వైజర్లు శ్రావణ్ కుమార్, సమోయుద్దీన్, సుధీర్, సుగుణమ్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు.