ఎదులాపురం, సెప్టెంబర్ 1: పెండ్లయి నాలుగునెలలు కూడా గడవకముందే భార్యపై అనుమానం మొదలైంది. అది ఇల్లాలిని అంతమొందించే దాకా వచ్చింది. తరువాత భయంతో ద్విచక్రవాహనంపై పారిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త కూడా దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఆదిలాబాద్లో చోటుచేసుకున్నది. వివరాలిలా.. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారి గూడలో నివాసం ఉంటున్న మోహితె జైవంత్, పద్మ దంపతుల కుమారుడు మోహితె అరుణ్ మేస్త్రీ పనిచేసేవాడు. ఇతనికి నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో గత మే 5న వివాహమైంది. పెండ్లయిన కొన్ని రోజులకే అరుణ్కు భార్య దీపపై అనుమానం మొదలైంది. తరచూ గొడవపడేవాడు.
ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి.
ఇటీవల నాగులపంచమికి తల్లిగారింటికి వెళ్లిన ఆమెను ఆగస్టు 29న తీసుకొచ్చాడు. శుక్రవారం ఉదయం దీపను ఇంట్లో మంచానికి కొట్టి గొంతునులిమి చంపాడు. తరువాత అరుణ్ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. ఇంటి ఎదుట ఉండే అరుణ్ తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం ఇంట్లోకి వచ్చి చూడగా, అప్పటికే దీప విగతజీవిగా కనిపించింది. కొడుకు అరుణ్కు ఫోన్ చేయగా, తానే చంపినట్టు ఒప్పుకున్నా డు. అనంతరం బైక్పై వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో మమతా జిన్నింగ్ సమీపంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త, అత్తామామలే తమ కూతురిని పొట్టన పెట్టుకున్నారని దీప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.