హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని టీఎస్ ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ శనివారం తీర్పు చెప్పింది. నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలని, ఒకవేళ ఆ నిబంధనల్లో మార్పు చేయాలంటే అందుకనుగుణంగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అధికారం సర్వీస్ కమిషన్ ఉన్నదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పీ మాధవీదేవి తీర్పు వెలువరించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అర గంట ముందుగా రావాలని, బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలని నోటిఫికేషన్ ఉన్నదని హైకోర్టు గుర్తు చేసింది. ఆ నోటిఫికేషన్ నిబంధనను సవరించకుండానే ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు, హాల్ టికెట్లను పరిశీలించి పరీక్షలకు అనుమతించారని పేర్కొన్నది. గతంలో గ్రూప్-4 పరీక్షల నిర్వహణ సమయంలో నోటిఫికేషన్ జారీ చేశాక వాటిని సవరిస్తూ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినట్టు గ్రూప్-1 విషయంలో చేయలేదని తెలిపింది.
2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలప్పుడు నిబంధనలను పక్కాగా అమలు చేసిన అధికారులు ఈ ఏడాది జూన్ అమలు చేయలేదని హైకోర్టు గుర్తు చేసింది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోవాలని, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు ఆసారం ఉందనే పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా ఉన్నదని, అభ్యర్థుల సంతకాల్లో కొద్దిపాటి తేడాలను పరీక్షలప్పుడు గుర్తించడం కష్టమని చెప్పింది. జూన్ 28న కమిషన్ వెబ్ 2,33,506 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని పేరొన్నదని, జూలై 12న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ఆ సంఖ్య 2,33,248 అని చెప్పిందని, కమిషన్ చర్యలు సక్రమంగా లేవని చెప్పడానికి ఇదొక నిదర్శనమని పేరొంది. అర్హులైన అభ్యర్థులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని తిరిగి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వానికి, టీఎస్ ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించేలా తీర్పు వెలువరించాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు బీ ప్రశాంత్, బండి ప్రశాంత్, జీ హరికృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యాజ్యాలపై శనివారం తీర్పు వెలువరించింది. నోటిఫికేషన్ నిబంధనలను అమలు చేయలేదని గత జూన్ 13న సర్వీస్ కమిషన్ వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోని కారణంగా హైకోర్టుకు రావాల్సి వచ్చిందన్న పిటిషనర్లు వాదనతో కోర్టు ఏకీభవించింది.
డివిజన్ బెంచ్ టీఎస్
హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్చును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వెళ్లాలని టీఎస్ భావిస్తున్నది. శనివారం హైకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే కమిషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. హైకోర్టు ఉత్తర్వులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలిసారి ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ అమలు చేశామని, దీనివల్ల కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని, అందుకే రెండోసారి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కమిషన్ మొదటి నుంచి చెప్తున్నది. దేశంలో అత్యున్నత నియామక సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సైతం బయోమెట్రిక్ తీసుకోవడం లేదనే విషయమై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ వెళ్లాలని నిర్ణయించింది.
రెండోసారి గ్రూప్-1 రద్దు
తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నిరుడు ఏప్రిల్ 26న టీఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలిసారి నిరుడు అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఆ తర్వాత టీఎస్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం చోటుచేసుకొన్నది. ఈ నేపథ్యంలో గ్రూప్-1తోపాటు మరికొన్ని పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. తొలిసారి రద్దుచేసిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న మళ్లీ నిర్వహించింది. రెండోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించలేదు. కానీ.. మొదటి సారి పరీక్ష రాసినవారితోపాటు దరఖాస్తు చేసుకున్న అందరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశాన్ని టీఎస్ ఇచ్చింది. రెండోసారి 2,33,506 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ప్రిలిమినరీ కీతోపాటు ఫైనల్ కీని విడుదల చేసింది. తుది ఫలితాలు ఇచ్చేసి.. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మెయిన్స్ నిర్వహించాలని భావించింది. అయితే, కొందరు కోర్టును ఆశ్రయించడంతో తుది ఫలితాల ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్చు వెలువరించింది. హైకోర్టు తీర్చును సవాల్ చేస్తూ సోమవారం డివిజన్ బెంచ్ వెళ్లాలని టీఎస్ భావిస్తున్నది.