ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలు ఈనెల 26 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నాలుగుసార్లు వాయిదాలకు అనుమతి ఇచ్చామని, మరోసారి దీర్ఘకాలం వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.
హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త గణేశ్రావు దాఖలు చేసిన వ్యాజ్యా న్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. 10వారాలు లేదంటే కనీసం నాలుగు వారాల గడువు ఇస్తే నియామక ప్రక్రియ పూర్తిపై వివరాలు అందజేస్తామని ప్రభుత్వం తెలుపగా, ఈ నెల 26 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.