హైదరాబాద్, జూన్ 27 ( నమస్తే తెలంగాణ): పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం హైదరాబాద్లోని కొత్వాల్గూడలో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటుచేస్తే తప్పేమిటని, నష్టం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే సింగపూర్, మలేషి యా లాంటి పలు దేశాల్లో ఉన్న ఆక్వా మెరైన్ పార్కులను హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది.
పర్యాటక అధ్యయనం చేయకుండా కొత్వాల్గూడలో ఆక్వా మెరైన్ పార్ ఏర్పాటు చేయడా న్ని చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలన్న పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం ఈ ప్రశ్నలు సంధించింది. విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.