హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ 2008 అభ్యర్థులను ఎస్జీటీ పో స్టుల్లో నియమించడంపై ఏపీ ప్రభుత్వ తరహా లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని హైకో ర్టు గురువారం ప్రభుత్వానికి సూచించింది. అదే నోటిపికేషన్కు చెందిన బీఈడీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శాశ్వత విధానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అవకాశం ఇచ్చిందని గుర్తు చేసింది.
ఒక నోటిఫికేషన్లోని అభ్యర్థుల్లో కొందరు ఉద్యోగాలు చేస్తుండగా మరికొందరు 15 ఏండ్లు పోరాటంలోనే ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇది సరైనది కాదని అభిప్రాయపడింది. 2008 డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులకు 30శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఎడ్ అభ్యర్థుల వ్యాజ్యాలను జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.